పేలుళ్లపై దర్యాప్తు ప్రహసనం!
-కె. బాలగోపాల్
ధనవంతుల వేషధారణలో ఫ్యాషన్లు మారినట్లు టెర్రరిస్టు నేరాల పరిశోధనలోనూ ఫ్యాషన్లు మారుతుంటాయి. నిన్నటి సూత్రధారి ఇవ్వాళ వినపడడు, ఇవ్వాళ్టి సూత్రధారి రేపు వినపడడు. దీనిని ప్రహసనం అనకపోతే ఇంకేమనాలి? ఇది ఎవరికి మంచిదని మన పాలకులు ఈ ప్రహసనాన్ని సాగనిస్తున్నారు?
పూర్తిగా చదవండి »
అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, జార్జ్ బుష్ అమెరికా ప్రజల, ప్రవాసుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. అప్పులలో నిండా మునిగిన ‘బేర్ స్ట్రెన్స్’ను 29 బిలియన్లతో, ఫ్రెడీ మేక్ – ఫ్రెనీమే కంపెనీలను 200 బిలియన్లతో, ఎఐజి ఇన్యూస్సూరెన్స్ కంపెనీని 85 బిలియన్లతో కొన్నాడు.
పూర్తిగా చదవండి »
ఉరితాళ్ళు పేనింది పాలకులే!
సిరిసిల్ల పవర్లూమ్ వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.
పూర్తిగా చదవండి »
కొడవటిగంటి కుటుంబరావు: శతజయంతి సంవత్సర కానుక
ప్రతి ఇంటా ఉండవలసిన కొకు రచనా ప్రపంచం
విరసం ప్రచురణగా కొకు రచనా ప్రపంచం 16 సంపుటాలు
కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి సందర్భంగా 2009లో ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించుకున్నది. తెలుగునాట నిజమైన విప్లవ, ప్రజాసాహిత్యోద్యమాన్ని నిర్మించి విస్తరిస్తున్న విరసం గతంలో శ్రీశ్రీ, చెరబండరాజు సమగ్ర రచనలను, కుటుంబరావు వ్యాసప్రపంచాన్ని ప్రచురించింది.
పూర్తిగా చదవండి »
భూములెందుకు ఇచ్చేయాలి?
సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?
పూర్తిగా చదవండి »
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఆకాశంలో ఉండే స్వర్గం గురించీ, కాళ్ళ కింద ఉండే నరకం గురించీ అనాదిగా కాకమ్మ కబుర్లు వింటునే ఉన్నాం. విజ్ఞానం వికసించని యుగంలోమనవాళ్ళు గంధర్వ, ఖేచర, కిన్నెర, కింపురుషుల గురించి చెప్పినట్టే (వీరిలోమానవమాత్రులు కానివారెవరో ఇప్పుడు సరిగా తెలియదు) ప్రపంచ నాగరికత లన్నిటిలోనూ అపోహలుండేవి.
పూర్తిగా చదవండి »
-డా//దార్ల వెంకటేశ్వరరావు
గతంలో తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన దళిత కవుల్లో కూడా అంబేద్కర్ భావజాలం కంటే, మార్క్సిస్టు భావాల పట్లే ఎక్కువ మమేకత్వం కనపడేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆ ధోరణి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అంబేద్కరిజమ్పై ఆసక్తి పెరుగుతుంది. స్థానీయతను ఆకాంక్షిస్తూనే, దళితుల ఆత్మగౌరవం అంబేద్కరిజమ్లోనే అంతర్భూతంగా ఉందనే సంగతిని గుర్తిస్తున్నారు.
పూర్తిగా చదవండి »
పోలేపల్లి సెజ్ పేరిట పేదల నుంచి ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి వారికి అప్పగించే వరకు తాము పోరాటాన్ని కొనసాగి స్తామని ప్రజాగాయకుడు గద్ధర్ ప్రకటించారు. తాము చనిపోయినా తమ వారసులకు ఈపోరాటాన్ని అప్పగిస్తామని, ముఖ్యమంత్రి వై.ఎస్ స్వయంగా వచ్చి పేదలకు తిరిగి భూములను అప్పగిస్తున్నట్లు ప్రకటించే వరకు ఎవరు అడొడచ్చినా తమ పోరాటాన్ని మాత్రం ఆపలేరని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి »